కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాల్డాలోని గజోల్ ప్రాంతంలో ఓ చేపల వ్యాపారి నివాసంపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.1.4కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు సంబంధించి ఓ వ్యక్తి ఇంట్లో భారీగా నగదు ఉంచినట్లు తమకు సమాచారం అందిందని సీఐడీ స్పెషల్ సూపరింటెండెంట్ తెలిపారు. మాల్దా జిల్లాకు చెందిన చేపల వ్యాపారి జై ప్రకాశ్ సాహాకు చెందిన గజోల్ నివాసంలో రూ.1.4కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం భారత్ – బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్నది. అయితే, సాహా డ్రగ్స్ స్మగ్లింగ్లో పాల్గొన్నాడా? అనే కోనణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.