కోల్కతా, ఏప్రిల్ 10: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెం గాల్లోని సందేశ్ఖాలీ ఘటనపై కలకత్తా హైకోర్టు స్పందించింది. అక్కడి మహిళలపై అఘాయిత్యాలు, భూ ముల ఆక్రమణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
దర్యాప్తును న్యా యస్థానం పర్యవేక్షిస్తుందని, దర్యా ప్తు నివేదికను కేసు తదుపరి వాయి దా రోజైన మే 2న సమర్పించాలం టూ చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నే తృత్వంలోని ద్విసభ్య డివిజన్ బెంచ్ బుధవారం ఆదేశించింది. ఈ కేసు లో టీఎంసీ మాజీ నేత షాజహాన్ షేక్ ప్రధాన నిందితుడు.