న్యూఢిల్లీ, జూన్ 13: పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల సామాన్యప్రజలకు కష్టం కలిగిస్తున్నదని, అయితే సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు అది తప్పట్లేదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు ఉచితంగా టీకా, పేదలకు ఉచితంగా రేషన్, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు.