శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో కరోనా మహమ్మారి కట్టడి కోసం కంప్లీట్ వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేయనున్నట్లు అక్కడి ప్రభత్వం ప్రకటించింది. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. అదేవిధంగా ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించింది.
అయితే, కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ఎనిమిది జిల్లాలకు ఈ కర్ఫ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తెలిపింది. కర్ఫ్యూ నుంచి మినహాయింపు లభించిన జిల్లాల్లో సోపియాన్, గండేర్బల్, బందిపొర, జమ్ము, సాంబా, కతువా, రియాసీ, ఉధంపూర్ ఉన్నాయి. ఈ మేరకు జమ్ముకశ్మీర్ పాలక యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది.