న్యూఢిల్లీ: ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ఎల్నినోతో పాటు ఇతర అంశాలు రుతుపవనాలపై ప్రభావం చూపొచ్చని పేర్కొన్నది. రుతుపవనాల రెండో అర్ధభాగం సీజన్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడుతాయంది.
దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాలు వర్షాభావానికి గురయ్యే ప్రమాదం ఉన్నదని తెలిపింది. జూలై-ఆగస్టు మధ్య గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో లోటు వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అయితే రుతుపవన కాలంలో వర్షాల అంచనాపై భారత వాతావరణ విభాగం ప్రకటన చేయాల్సి ఉన్నది.