న్యూఢిల్లీ: తామెప్పుడూ సైన్యం చేతులు కట్టేయమని, సరిహద్దులకు సంబంధించి వాళ్లు ఎప్పుడైనా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ( Rajnath Singh ) అన్నారు. సైన్యం ఏ నిర్ణయం తీసుకున్నా తాము సమర్థిస్తామని చెప్పారు. ఒక రక్షణమంత్రిగా తాను ఈ మాట చెబుతున్నానని అన్నారు. వాళ్ల నిర్ణయాలవల్ల అనుకోకుండా ఏదైనా తప్పు జరిగినా తాము సైన్యానికి అండగా ఉంటామని రాజ్నాథ్ హామీ ఇచ్చారు.
పొరుగు దేశాలకు సరైన సంకేతాలివ్వడంలో ఇప్పుడు మన జవాన్లు విజయవంతమయ్యారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. అయితే, ఈ మధ్య కొందరు మన సైనికుల పరాక్రమాన్ని ప్రశ్నించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. సరిహద్దు అంశాలపై విమర్శలు కరెక్టు కాదని, సరిహద్దులో పోరాటం చేసేది నాయకులు కాదని, సైనికులని ఆయన చెప్పారు.