న్యూఢిల్లీ, ఆగస్టు 21: కోర్టుకు హాజరుకావాలని ప్రభుత్వ అధికారులకు సమన్లు జారీ చేసే విషయంలో విస్తృత మార్గదర్శకాలను జారీచేస్తామని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొన్నది. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులు పాటించాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తుది తీర్పులు, పెండింగ్ కేసుల్లో ఇచ్చే మధ్యంతర ఉత్వర్వులను పాటించకపోవడం వలన తలెత్తే ధిక్కార చర్యలపై వ్యవహరించే విషయంలో వేర్వేరు విధానాలు ఉండాలని అభిప్రాయపడింది. పెండింగ్ కేసుల్లో అధికారులు ఇచ్చే అఫిడవిట్లు సరిపోతాయని, అదే తీర్పులను పాటించని ధిక్కార కేసుల్లో అయితే.. సంబంధిత ప్రభుత్వ అధికారి కోర్టుకు తప్పక హాజరుకావాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొన్నది.