న్యూఢిల్లీ, జనవరి 1: విదేశాల్లో ఉంటూ భారత్ను బెదిరిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి రెచ్చిపోయాడు. భారత దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తానని, మార్చి 12 నుంచి బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లపై దాడి చేస్తానని బెదిరించాడు. ఇండియన్ స్టాక్స్ను వదిలిపెట్టి, మార్చి 12లోగా అమెరికన్ స్టాక్స్ను కొనాలని పిలుపునిచ్చాడు. ముంబైలో వరుస పేలుళ్లు జరిగి మార్చి 12 నాటికి 31 సంవత్సరాలు అవుతుందనే విషయం తెలిసిందే.