Parliament Security Breach | న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కేసు నిందితులు ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో తమకు విపక్ష పార్టీలతో సం బంధముందని ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు పెడుతున్నారని ఐదుగురు నిందితులు అడిషనల్ సెషన్స్ జడ్జికి విన్నవించారు.
తమచేత బలవంతంగా 70 ఖాళీ పేపర్లపై సంతకా లు పెట్టించుకున్నారని, ఈ ఘటనతో జాతీయ ప్రతిపక్ష పార్టీలకు సంబం ధం ఉందని చెప్పాలంటూ తమను విద్యుత్తు షాక్లు పెట్టి తీవ్రంగా హింసించారని ఆరోపించారు.