న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత యువశక్తి సామర్థ్యాన్ని చూశామని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ 7 పతకాలు సాధించిందని చెప్పారు. టోక్యో పారాలింపిక్స్లో కూడా భారత్ 19 పతకాలు సాధించి రికార్డు సృష్టించిందని రాష్ట్రపతి ప్రశంసించారు. ఒలింపిక్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో భారత్ ఉనికిని బలోపేతం చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం వందల కొద్దీ ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని అన్నారు.
జాతీయ విద్యా విధానంలో భాగంగా స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్రపతి కోవింద్ తెలిపారు. ఇందులో భాగంగా ముఖ్యమైన ప్రవేశ పరీక్షలను భారతీయ భాషల్లో నిర్వహించడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది నుంచి 10 రాష్ట్రాల్లోని 19 ఇంజినీరింగ్ కాలేజీలు ఆరు ప్రాంతీయ భాషల్లో బోధించనున్నాయని అన్నారు.
అలాగే దేశంలోని మొత్తం 33 సైనిక్ స్కూల్స్లో ఇప్పుడు అమ్మాయిలకు కూడా అడ్మిషన్ ప్రారంభించడం సంతోషకరమైన విషయమని రాష్ట్రపతి కోవింద్ తెలిపారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో మహిళా క్యాడెట్ల ప్రవేశానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ ఏడాది జూన్లో తొలి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఎన్డీఏలో శిక్షణ ప్రారంభిస్తారని చెప్పారు.