బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం తాము శక్తివంచన లేకుండా శాయశక్తులా కృషి చేశామని, అయినా విజయం సాధించడంలో విఫలమయ్యామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు. తాము ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ దాదాపు 20 స్థానాల్లో విజయం సాధించింది. మరో 110కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ తాము ఓటమిని అంగీకరిస్తున్నామని ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ, ఇతర నేతలు, కార్యకర్తలు అందరం సమిష్టిగా కృషిచేసినా కావాల్సిన మార్క్ సాధించలేకపోయామని చెప్పారు. పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత తాము సమగ్ర విశ్లేషణ చేసుకుంటామని, లోపాలను సరిదిద్దుకుని లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని అన్నారు.
Also Read..
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్