న్యూఢిల్లీ: కోర్టు ధిక్కారణపై క్షమాపణలు చెబుతూ పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వారి క్షమాపణలను అంగీకరించబోమని, చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
బుధవారం కోర్టు పతంజలి యాడ్స్ కేసును విచారించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చర్యలు తీసుకోనందుకు ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీలోని ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.