చండీగఢ్: రైతులకు తీవ్ర అన్యాయం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో శిక్షించాలని ప్రజలను కోరుతామని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ గురువారం మీడియాతో మాట్లాడు తూ రైతులపై నల్ల చట్టాలతో వారి అ ణచివేతకు ప్రయత్నించిన కేంద్రానికి బుద్ధి చెప్పాలని, అందుకే బీజేపీపై ఉ ద్యమాన్ని తీవ్రతరం చేయడానికి మే 21న పంజాబ్ జాగరణ్ను నిర్వహించనున్నట్టు చెప్పారు. ‘బీజేపీని ఓడించండి..కార్పొరేట్లను తరిమికొట్టండి’ అన్నది తమ నినాదమన్నా రు. బీజేపీ తప్ప గెలిచే ఏ ఇతర అభ్యర్థికైనా ఓటు వేయాలన్నారు.