శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. దాల్ సరస్సులో కూడా లోపలివైపు ఉన్న నీరు గడ్డకట్టుకుపోయింది.
జమ్ముకశ్మీర్లో గత కొన్ని రోజులుగా పశ్చిమ గాలులు వీస్తున్నాయని, ఆ గాలుల ప్రభావంతో కశ్మీర్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడటమేగాక విపరీతంగా మంచు కురుస్తున్నదని, దాంతో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి శ్రీనగర్లో మైనస్ 5.4 డిగ్రీ సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు.
#WATCH | J&K: With the temperature going below zero degrees, water bodies freeze in higher reaches; visuals from Srinagar. pic.twitter.com/li5CfYFfnF
— ANI (@ANI) December 16, 2023