ఫరీద్కోట్: దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ మెడికల్ షాపులోకి దూసుకెళ్లారు. వెంటనే షాప్ ఓనర్కు తుపాకీ గురిపెట్టి కాల్చిచంపుతామని బెదిరించారు. క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.40 తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్కోట్ పట్టణంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే, దోపిడీ దొంగల చోరీ ఘటన పూర్తిగా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ముగ్గురు వ్యక్తులు మెడికల్ షాప్లోకి వచ్చి వారిలో ఒకడు షాప్ ఓనర్కు తుపాకీ గురిపెట్టాడు. మరొకడు షాప్ ఓనర్తోపాటు ఉన్న ఇంకో వ్యక్తి ఒడిసిపట్టుకున్నాడు. ఇంకొకడు క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసి అందులో ఉన్న రూ.40 వేలు తీసుకున్నాడు.
అనంతరం ముగ్గురూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కింది వీడియోలో చోరీ జరిగిన తీరును గమనించవచ్చు.
#WATCH | Unidentified miscreants looted around Rs 40,000 from a medical shop owner at gunpoint in Punjab’s Faridkot yesterday.
(CCTV visuals confirmed by police) pic.twitter.com/Xu7lnM0Fmu
— ANI (@ANI) January 16, 2023