పూరీ: దేశమంతా జగన్నాథ స్వామి ఆలయాల్లో కోలాహలం నెలకొన్నది. ఇవాళ జగన్నాథుని రథయాత్ర నిర్వహించనుండటంతో భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి (Sand artist) సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik).. సముద్ర తీరంలో ఓ అద్భుతాన్ని సృష్టించారు. బంగాళాఖాతం తీరానగల పూరీ బీచ్లో పూరీ జగన్నాథ రథయాత్రను ప్రతిబింబించేలా సైకత శిల్పాన్ని రూపొందించారు.
ఈ సైకత శిల్పం రూపకల్పనలో రకరకాల రంగులను పట్నాయక్ వినియోగించారు. అదేవిధంగా 250 కొబ్బరికాయలను కూడా సుదర్శన్ పట్నాయక్ ఈ సైకత శిల్పం కోసం ఉపయోగించారు. ఈ కింది వీడియోలో పట్నాయక్ సృష్టించిన ఆ అద్భుత సైకత శిల్పాన్ని వీక్షించవచ్చు. మరింకెందుకు ఆలస్యం వెంటనే చూసేయండి..