Tajinder Bittu : లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత తాజిందర్ సింగ్ బిట్టు ఏఐసీసీ కార్యదర్శి పదవికి, హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపించారు.
ఆ తర్వాత బిట్టు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, పార్టీ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్డే సమక్షంలో బిట్టూ కాషాయ కండువా కప్పుకున్నారు. తాను మూడున్నర దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని చెప్పారు.
#WATCH | Tajinder Singh Bittu, who resigned from Congress today, joins BJP at the party headquarters in Delhi in the presence of Union Minister Ashwini Vaishnaw and party general secretary Vinod Tawde
Tajinder Singh Bittu resigned from his post of AICC Secretary In-Charge… pic.twitter.com/LaTBgI315v
— ANI (@ANI) April 20, 2024
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజా సంక్షేమ అంశాలపై మాట్లాడటం లేదని, పార్టీ తీరు మారిపోతున్నదని ఆరోపించారు. పంజాబ్ మేలు కోసమే తాను కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరానని చెప్పారు. ఈ విషయంలో తాను ఎవరినీ వ్యక్తిగతంగా నిందించదలుచుకోలేదని తాజిందర్ బిట్టు పేర్కొన్నారు.