నలంద: పెద్దల నిర్లక్ష్యం పిల్లల పాలిట శాపంగా మారుతున్నది. సాగునీటి కోసం బోర్లు వేస్తున్న రైతులు నీళ్లు పడకపోతే వాటిని అలాగే ఓపెన్గా వదిలేస్తున్నారు. దాంతో అభంశుభం తెలియని చిన్నారులు ఆడుకుంటూ వాటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బీహార్లోని నలంద జిల్లా కులూ గ్రామంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. శుభ్మన్ కుమార్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నిరుపయోగంగా ఉన్న 40 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరుబావిలోకి కెమెరాను పంపించి ఆ బాలుడు ప్రాణాలతోనే ఉన్నాడని గుర్తించారు. బాలుడు బోరుబావి అడుగున నీళ్లలో ఉన్న దృశ్యాలను కుటుంబసభ్యులకు చూపించారు. జేసీబీల సాయంతో బోరుబావికి సమాంతరంగా గుంత తీసి బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
గ్రామానికి చెందిన ఓ రైతు సాగునీటి కోసం బోరు వేయించాడని, అయితే ఆ ప్రాంతంలో నీళ్లు రాకపోడంతో మరోచోట బోరుబావి తవ్వించాడని, ఆ తర్వాత నీళ్లు పడని బోరుబావిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో బాలుడు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడని కులూ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ నళిన్ మౌర్య వెల్లడించారు.
#WATCH | Rescue operation underway to rescue a child who fell into a borewell in Kul village of Nalanda, Bihar.
Police and district administration officials are present on the spot. pic.twitter.com/7kVAmebCWd
— ANI (@ANI) July 23, 2023
#WATCH Bihar: Rescue operation underway by NDRF team after a child fell into a borewell in Kul village in Nalanda. https://t.co/HdcCri8c7O pic.twitter.com/K4rB1OyjRB
— ANI (@ANI) July 23, 2023