జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచి జనం పోలింగ్ కేంద్రాల తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (RPCC) చీఫ్ గోవింద్ సింగ్ దొతస్రా.. సికర్ పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు వేశారు. ఆయన లక్ష్మణ్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
కాగా, రాజస్థాన్లోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకేరోజు ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్నది. ఫలితాలను వచ్చే నెల 3న వెల్లడించనున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదేరోజు వెల్లడికానున్నాయి. ఇవాళ్టితో మొత్తం నాలుగు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తికాగా, ఈ నెల 30న తెలంగాణలో పోలింగ్ జరుగనుంది.