Turbans: ఎవరి చేతనైనా, దేనివల్లనైనా అవమానించబడినప్పుడో, ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినప్పుడో కొంత మంది శపథం చేస్తుంటారు. ఆ శపథాన్ని మర్చిపోకుండా ఉండటం కోసం తమకు ఎంతో ముఖ్యమైన వాటిని త్యజిస్తుంటారు. శపథం నెరవేరిన తర్వాతనే ఆ త్యజించినదాన్ని తిరిగి తీసుకుంటారు. శపథం నెరవేరేదాకా కాలికి చెప్పులు వేయనని కొందరు, గడ్డం తీయించుకోనని కొందరు ప్రమాణాలు చేస్తుంటారు. సరిగ్గా అలాంటి ప్రమాణమే చేసిన ఒక వంశీయుల శపథం దాదాపు 500 ఏళ్ల తర్వాత నెరవేరింది. ఆసక్తి రేపుతున్న ఆ శపథం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అది సూర్యవంశి థాకూర్ వంశం. వారి స్వస్థలం అయోధ్యలోని సరైరాశి గ్రామం. వాళ్లు తమది శ్రీరాముడికి సంబంధించిన వంశంగా చెప్పుకుంటారు. దాదాపు 500 ఏళ్ల క్రితం అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చినప్పుడు.. ఈ సూర్యవంశీ థాకూర్ వంశానికి చెందిన పూర్వీకులు తమ తలలపై ఉన్న తలపాగలను తీసేశారట. మళ్లీ కూల్చినచోటనే రామ మందిరం నిర్మించే వరకు తాము తలపాగలు ధరించబోమని నాడు శపథం చేశారట. ఇప్పుడు దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో తిరిగి రామ మందిరాన్ని నిర్మించడంతో వారి శపథం నెరవేరింది.
ఈ క్రమంలో ఆ సూర్యవంశి థాకూర్ వంశీయులు సంతోషం వ్యక్తంచేశారు. శపథం నెరవేరినందున వెనుకటికి ప్రమాణం చేసినట్టుగానే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత తలపాగలు ధరించారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో దానికి ముందే వారు ఈ తంతును పూర్తిచేశారు. సూర్యవంశి థాకూర్ వంశీయులు దాదాపు 500 ఏళ్ల తర్వాత తలపాగలు ధరిస్తున్న దృశ్యాలు కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Uttar Pradesh: People from the ‘Suryavanshi Thakur’ community in Sarairasi village of Ayodhya wear turbans after almost 500 years, ahead of Ram Temple’s ‘pranpratishtha’. The community had taken an oath that they would not wear a turban till the temple was reconstructed… pic.twitter.com/9QZckTGbEk
— ANI (@ANI) January 18, 2024