లక్నో: దళిత వ్యక్తిపై హోంగార్డులు తమ ప్రతాపం చూపించారు. కిందకు తోసి కాళ్లతో తన్నారు. రైఫిల్ బట్తో కొట్టారు. ఉచితంగా రేషన్ తీసుకుంటున్న వారు ప్రభుత్వానికి ఓటు వేయడం లేదని ఆ హోంగార్డులు అన్నారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Dalit man kicked by home guards) బహోరంగాల గ్రామానికి చెందిన వీరేంద్ర కుమార్ జాతవ్ వాచ్మెన్గా పని చేస్తున్నాడు. దళిత వర్గానికి చెందిన అతడు భూమి దస్తావేజు కోసం తహసీల్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న హోంగార్డులు వీరేంద్ర కుమార్ను కులం పేరుతో దూషించారు. ఉచితంగా రేషన్ తీసుకుంటున్న వారు ప్రభుత్వానికి ఓటు వేయడం లేదని వ్యంగ్యంగా అన్నారు.
కాగా, వీరేంద్ర కుమార్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరు హోంగార్డులు కలిసి అతడిపై దాడి చేశారు. అంతా చూస్తుండగా కిందపడేసి రైఫిల్ బట్తో కొట్టారు. బూటు కాళ్లతో తన్నారు. అక్కడున్న వారు చూస్తున్నప్పటికీ లెక్కచేయని ఆ హోంగార్డులు ఆ దళిత వ్యక్తిపై తమ ప్రతాపాన్ని చూపారు.
మరోవైపు కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో దళితుడైన వీరేంద్ర కుమార్ జాతవ్ను కొట్టిన హోంగార్డులు వీర్ బహదూర్, రాంపాల్పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.
A Dalit watchman was beaten and assaulted by two Home Guards in Uttar Pradesh's Bareilly district as the public looked on. According to local reports, the victim protested after the Home Guards allegedly made casteist remarks on him. the Dalit watchman lying on the ground while… pic.twitter.com/O5Mq8ruEho
— The Siasat Daily (@TheSiasatDaily) May 15, 2024