తిరువనంతపురం: ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఘోరం జరిగింది. రెండు బస్సుల్లోని 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళలోని తిరువనంతపురం-కన్యాకుమారి జాతీయ రహదారిపై నెయ్యట్టింకర దగ్గర శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కేరళ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్కు చెందిన రెండు బస్సులు ఒకదానికి ఒకటి ఎదురుపడి వెలుతురు సరిగా లేకపోవడంతో ఢీకొన్నాయి.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. స్థానికులతో కలిసి క్షతగాత్రులను బస్సుల్లోంచి బయటికి తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం వారిని తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి, నెయ్యట్కర్ జిల్లాలోని జనరల్ ఆస్పత్రికి, నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనలో మరణాలేమీ సంభవించలేదని, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
#WATCH | Kerala | Over 30 people injured in a collision between two buses of Kerala State Road Transport Corporation (KSRTC) in Neyyattinkara on the Thiruvananthapuram-Kanyakumari highway last night. The injured people were admitted to Thiruvananthapuram Medical College Hospital,… pic.twitter.com/A3Ft9NvK05
— ANI (@ANI) November 26, 2023