న్యూఢిల్లీ : దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మరోసారి సమావేశమైంది. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే మూడు సార్లు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చంచిన కూటమి నేతలు తాజాగా నాలుగోసారి సమావేశమయ్యారు. ఢిల్లీలోని అశోకా హోటల్లో సమావేశం జరుగుతున్నది.
ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సహా ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం, పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు తదితర అంశాలు ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
#WATCH | Meeting of the INDIA Alliance begins, in Delhi.
(Source: AICC) pic.twitter.com/a1WKjhN61U
— ANI (@ANI) December 19, 2023