Terrorists arrest : జమ్ముకశ్మీర్ (Jammu & Kahmir) పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు లష్కర్ ఎ తోయిబా (Lashkar-e-Taiba) ఉగ్రవాదుల (Terrorists) ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ముగ్గురు ఉగ్రవాదులు ఒసామా యాసిన్ షేక్, ఉమర్ ఫయాజ్ షేక్, అర్ఫాన్ మన్సూర్ షేక్లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు ఉగ్రవాదులు శ్రీనగర్లో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు.
కశ్మీర్ ఐజీ వీకే బిర్ది ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న ఈ ముగ్గురు ఉగ్రవాదులు శాంతి భద్రతల సమస్యను సృష్టించాలనే ఉద్దేశంతో గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారని, ఈ దాడిలో 12 మంది పౌరులు గాయపడ్డారని బిర్ది తెలిపారు. ఈ ముగ్గురు టెర్రరిస్టులతోపాటు వారికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పాకిస్థాన్లో ఉన్న సూత్రదారుల సూచన మేరకు ఇక్కడ గ్రెనేడ్ దాడి జరిగిందని అన్నారు.
#WATCH | Srinagar, J&K: Police have detained 3 Lashkar-e-Taiba terrorists, identified as Osama Yasin Sheikh, Umar Fayaz Sheikh and Afnan Mansoor Sheikh, in connection with the grenade attack in Srinagar on November 3. 12 civilians were injured in this attack. https://t.co/SSnwbW1LGb pic.twitter.com/Phkl7Rlnll
— ANI (@ANI) November 8, 2024