Holi: పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో పొరుగు దేశాల నుంచి భారత్కు వచ్చిన శరణార్థులు సంబురాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పటాకులు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని మంజూ కా తిల్లా ఏరియాలో కూడా పాకిస్థానీ శరణార్థులు సంబురాలు చేసుకున్నారు. మహిళలు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ పండుగ ముందే వచ్చిందా..! అన్నట్టుగా వేడుక జరుపుకున్నారు. ఈ సంబురాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Delhi | Holi comes early for Pakistani refugees living in Majnu Ka Tilla, as the Government of India notifies the Citizenship Amendment Act (CAA).
Visuals from the area as people celebrate. pic.twitter.com/4leaWYWd2z
— ANI (@ANI) March 12, 2024
కాగా, మతపరమైన హింస కారణంగా పొరుగు దేశాల నుంచి భారత్లోకి వచ్చిన ముస్లిమేతరులకు ఇక్కడి పౌరసత్వం కల్పించేలా మోదీ సర్కారు బిల్లును రూపొందించి 2019లో పార్లమెంటులో ఆమోదింప జేసుకుంది. అయితే అప్పట్లోనే చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నించగా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో అప్పటికి వెనక్కి తగ్గిన కేంద్రం నిన్నటి నుంచి అమల్లోకి తెచ్చింది.