షిమ్లా: శీతాకాలం చివరలో చలి తీవ్రత మరింత పెరిగింది. దేశమంతటా జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో నిత్యం మంచు కురుస్తున్నది. ఆయా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అయితే మంచు తీవ్రంగా పడుతున్నది. దాంతో జనం ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు.
ఈ కింది వీడియో చూడండి.. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం కులూ జిల్లాలోని రోహ్తంగ్ పాస్ ఏరియా ఇది. ఇవాళ ఉదయం అక్కడ విపరీతంగా మంచు కురవడంతో రోహ్తంగ్ పాస్ పూర్తిగా మంచులో కూరుపోయింది. తెల్లటి మంచుగడ్డల కింద కనిపించకుండా మునిగిపోయింది. ఆ రహదారి వెంట పార్కుచేసిన వాహనాలు కూడా మంచులో మునిగిపోయాయి..
#WATCH | Himachal Pradesh: Rohtang Pass in Kullu covered in a blanket of snow pic.twitter.com/ipP8BzOoVC
— ANI (@ANI) January 25, 2023