Ayodhya: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్య నగరంలోని రామ జన్మభూమి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిత్యం భారీ సంఖ్యలో భక్తులు రామయ్య దర్శనానికి తరలివస్తున్నారు. శనివారం ఉదయం అయోధ్య రామాలయానికి వచ్చిన భక్త జనసందోహాన్ని కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
కాగా, ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగి 20 రోజులు అవుతున్నా రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఇంకా ఏమాత్రం తగ్గలేదు.
#WATCH | Uttar Pradesh: Devotees throng the Ram Janmabhoomi Temple in Ayodhya to have darshan of Lord Ram. pic.twitter.com/2y9H6r3yAQ
— ANI (@ANI) February 10, 2024