శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం ఉదయం జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ సిటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఆమెకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులతో కాసేపు మాట్లాడిన ఆమె అనంతరం నగీన్ సరస్సును సందర్శించారు. ఇంజిన్ బోటుపై ఆ సరస్సులో చక్కెర్లు కొట్టారు.
సోనియాగాంధీ బోట్ రైడ్కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కింది వీడియోల్లో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు. కాగా సోనియాగాంధీ తనయుడు, ఎంపీ రాహుల్గాంధీ ఇప్పటికే జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. మరికాసేపట్లో సోనియాగాంధీ కూడా రాహుల్గాంధీతో భేటీ కాబోతున్నారు. స్థానిక పార్టీ శ్రేణులతో వారు సమావేశం కానున్నారు.
#WATCH | J&K: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrived in Srinagar and took a boat ride in Nigeen Lake. pic.twitter.com/a0NHTqzor1
— ANI (@ANI) August 26, 2023
#WATCH | J&K: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives in Srinagar and takes a boat ride in Nigeen Lake
She will be meeting Congress MP Rahul Gandhi shortly pic.twitter.com/9jBEKG2ZB8
— ANI (@ANI) August 26, 2023