Kangana Ranaut : ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లాలోని భీమకాళీ ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అర్చన చేయించారు. అనంతరం అర్చకుల నుంచి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అంతకుముందు ఆలయ అర్చకులు కంగనాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెతో స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు.
#WATCH | BJP candidate Kangana Ranaut offers prayers at Bhimakali Temple in Himachal Pradesh’s Mandi pic.twitter.com/MtDwZqS2nP
— ANI (@ANI) April 1, 2024
కాగా, తనను తాను హిమాచల్ప్రదేశ్ ఆడబిడ్డగా చెప్పుకుంటున్న కంగనా రనౌత్ ఈసారి లోక్సభ సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు. హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ ప్రతిభాసింగ్ను ఆమె ఢీకొట్టబోతున్నారు. హిమాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమార్తెనే ఈ ప్రతిభాసింగ్. ముందుగా మండి నుంచి పోటీకి నిరాకరించిన ప్రతిభ.. బీజేపీ కంగనా రనౌత్ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో నిర్ణయం మార్చుకున్నారు.
భీమకాళీ ఆలయం పరిసరాల్లోనే బీజేపీ ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లు చేసింది. దాంతో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కంగనా రనౌత్ పనిలోపనిగా అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆమె ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
#WATCH | BJP candidate from Mandi Lok Sabha seat, Kangana Ranaut, former CM Jairam Thakur and BJP leaders arrive at Bhimakali temple complex for a party meeting, in Mandi#HimachalPradesh pic.twitter.com/EVcUtf4aXZ
— ANI (@ANI) April 1, 2024