Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ టాటా చెప్పి తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ పరిణామం.. నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీఏతో జట్టు కట్టనున్నాడనే ప్రచారం నిజమేనేమో అనే అనుమానం కలిగిస్తున్నది.
ఇవాళ బీహార్ రాజధాని పట్నాలోని రాజ్భవన్లో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆధ్వర్యంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమానికి సీఎం నితీశ్ కుమార్, మంత్రి అశోక్ చౌధరి హాజరయ్యారు. కానీ ఆర్జేడీ అగ్రనేత, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. దాంతో ఆర్జేడీ, జేడీయూ కటీఫ్ వార్తలు నిజమేననే అనుమానం కలుగుతున్నది.
#WATCH | Bihar CM Nitish Kumar and Bihar Minister Ashok Choudhary present at an official event in Raj Bhavan, Patna.
Bihar Deputy CM Tejashwi Yadav is not present at the event. pic.twitter.com/bdHNECUn2a
— ANI (@ANI) January 26, 2024