న్యూఢిల్లీ: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, శివసేన షిండే వర్గంలో చేరిన మిలింద్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని వీడాలని అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ‘డిజిటల్ మీడియా వారియర్స్’తో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ వీడియోను శుక్రవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పతనం, రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడిన అస్సాం సీఎం హిమంత బిస్వా గురించి పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘హిమంత, మిలింద్ వంటి వ్యక్తులు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాలని నేను కోరుకుంటున్నా. నేను దానికి పూర్తిగా సమ్మతిస్తున్నా. కాంగ్రెస్కు వర్తించని నిర్దిష్ట రాజకీయాలకు హిమంత ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముస్లింల గురించి హిమంత చేసిన వ్యాఖ్యలు మీరు గమనించారా? కొన్ని విలువలను నేను సమర్థిస్తా’ అని అన్నారు.
కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై ఈడీని ఉసుగొల్పుతున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ ప్రశ్నించిందని అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి సమన్లు జారీ చేసిందని చెప్పారు. తనను కూడా ఈడీ 55 గంటలు ప్రశ్నించిందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎలాంటి ఒత్తిడి లేకుండానే ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమిని వీడారని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్లో పొత్తు ముగిసినట్లు కాంగ్రెస్ గానీ, సీఎం మమతా బెనర్జీ గానీ చెప్పలేదని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఇండియా’ బ్లాక్తోనే ఉన్నట్లు మమత చెప్పారని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం గురించి రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే బెంగాల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
मैं मुश्किल सवालों से नहीं डरता, फिर वो INDIA गठबंधन पर हो, कांग्रेस छोड़ गए नेताओं पर हो या #PaanchNYAY पर।
पश्चिम बंगाल में डिजिटल मीडिया योद्धाओं के साथ एक लंबी और सार्थक चर्चा हुई।
ईमानदारी से खुलकर सवालों का जवाब देना अच्छा लगता है, सत्ता में बैठे लोग भी कोशिश कर सकते हैं। pic.twitter.com/ZFxHvPDP1q
— Rahul Gandhi (@RahulGandhi) February 2, 2024