Pak Vs India | పాకిస్థాన్ ప్రధాని షానవాజ్ షరీఫ్.. శాంతి మంత్రం పఠిస్తున్నారు. భారత్తో యుద్ధం ఆప్షన్ కాదని చెప్పారు. చర్చల ద్వారా శాశ్వత శాంతి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రెండు దేశాలు కశ్మీర్ అంశం పరిష్కరించుకుంటే తాము శాంతి కోరుకుంటున్నట్లు హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో జరిగిన భేటీలో చెప్పారని శనివారం వార్తా కథనాలు వచ్చాయి.
ఐక్యరాజ్యసమితి (ఐరాస) తీర్మానాలకు కట్టుబడి కశ్మీర్ అంశానికి పరిష్కారం కనుగొనడంతోపాటు దక్షిణాసియా ప్రాంతంలో సుస్థిర శాంతి కావాలని కోరుకుంటున్నామని ఆయన అన్నట్లు అంతర్జాతీయ దిన పత్రిక.. ది న్యూస్ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది. ఏ దేశానికైనా యుద్ధం ఆప్షన్ కాదని షానావాజ్ షరీఫ్ చెప్పారు.
జమ్ముకశ్మీర్తోపాటు పాకిస్థాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదానికి ప్రోత్సాహం లభిస్తుండటంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తింటున్నాయి. జమ్ము కశ్మీర్ తమ అంతర్గత అంశం అని పాకిస్థాన్కు భారత్ తెగేసి చెప్పింది. పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి పలికితే, హింసకు చరమగీతం పాడితే ఆ దేశంతో సాధారణ సంబంధాలు కలిగి ఉండేందుకు ఆసక్తితో ఉన్నట్లు భారత్ పేర్కొంటున్నది.