ఢిల్లీ : వృక్షారోపణ్ అభియాన్-2021 ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. బొగ్గు గనుల క్షేత్రాల్లో వాతావరణ సమతుల్యతను సంరక్షించేందుకు, పచ్చదనం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ వ్యాప్తంగా 2,385 హెక్టార్లలో గుర్తించిన 300 ప్లాంటేషన్ ప్రాంతాల్లో ఈ గో గ్రీనింగ్ డ్రైవ్ కొనసాగనుంది. కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రి రావ్సాహెబ్ పటేల్ దన్వే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.