కిష్ట్వార్: జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో ఇవాళ తొలి దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతోంది. కిష్ట్వార్లో కాసేపు పోలింగ్ను నిలిపివేశారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా ఓ వ్యక్తి పోలింగ్ స్టేషన్కు వచ్చాడు. దీంతో అక్కడ కాసేపు పోలింగ్ను నిలిపివేశారు. ఇక్కడ ఉన్న ప్రజల్లో గందరగోళం ఉన్నదని, ఓ సమస్య వచ్చిందని, కానీ దాన్ని పరిష్కరించినట్లు కిష్ట్వార్ డీఎం రాజేశ్ కుమార్ తెలిపారు. ఐడెంటిఫికేషన్కు చెందిన ఓ ఇష్యూ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఓ ఓటరు వద్ద గుర్తింపు కార్డు లేదని, కానీ ప్రస్తుతం పరిస్థితి నార్మల్కు వచ్చినట్లు వెల్లడించారు. పీడీపీ, ఎన్సీ వర్కర్లు పోలింగ్ బూత్లోకి వెళ్లినట్లు బీజేపీ నేత షాగున్ పరిహార్ ఆరోపించారు. తనను నెట్టివేసినట్లు ఆమె పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్లో మధ్యాహ్నం ఒకటి వరకు 41.47 శాతం ఓటింగ్ జరిగింది.
#WATCH | Jammu and Kashmir: BJP candidate from Kishtwar, Shagun Parihar says, “The (PDP) candidate came here and said this girl is playing the victim card and trying to get sympathy. I felt bad. I said why would I play the victim card and said you have made me a victim. They… https://t.co/vgcVLgrjbB pic.twitter.com/te879tY39W
— ANI (@ANI) September 18, 2024