ముంబై: బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) కి లీగల్ నోటీస్ పంపించారు. తన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై మమతాబెనర్జి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను ఆమెకు లీగల్ నోటీస్ పంపించానని అగ్నిహోత్రి తెలిపారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా సమాజంలో ఒక వర్గాన్ని కించపర్చే విధంగా ఉన్నదని సోమవారం మమతాబెనర్జి విమర్శించారు.
దాంతో అగ్నిహోత్రి ఆమెకు లీగల్ నోటీస్లు పంపారు. తాను తీసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతోపాటు తన రాబోయే మరో సినిమా కూడా పశ్చిమబెంగాల్లో హింసాకాండను ఆధారంగా తీసుకుని తీస్తున్నవేనని మమతాబెనర్జి ఆరోపిస్తున్నారని, కానీ ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, అంతా తప్పుడు ప్రచారమని అగ్నిహోత్రి విమర్శించారు. తన సినిమాలకు బీజేపీ నిధులు సమకూరుస్తున్నదని కూడా మమత ఆరోపించారని, అది కూడా తప్పుడు ఆరోపణేనని అన్నారు.