తిరువనంతపురం: వాహనం ఎలా నడపాలనే విషయంలో సవాలక్ష నిబంధనలు ఉన్నా వాటిని పాటించేవాళ్లు మాత్రం అరుదు. దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో రాంగ్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. తాజాగా కేరళలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కేరళ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్కు చెందిన డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు.
ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో రాంగ్ రూట్లో వస్తూ ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టాడు. కారును తప్పించే ప్రయత్నంలో స్టీరింగ్ను ఎడమవైపునకు లాగి చర్చి ముందున్న ఆర్చిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. చర్చి ఆర్చి కుప్పకూలింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లా కిజావళ్లూర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరూ చూడండి..
#WATCH | Kerala: A Kerala State Road Transport Corporation bus met with an accident after colliding with a car near Kizhavallor in Pathanamthitta district. Thereafter, the bus rammed into the wall of a church. Injured passengers were rushed to hospital. pic.twitter.com/SiFjOvDLsR
— ANI (@ANI) March 11, 2023