బెంగళూరు: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం జూనియర్ డాక్టర్లు (Karnataka Junior Doctors) ప్రభుత్వ ఆసుపత్రిలో రీల్స్ రికార్డ్ చేశారు. ఇవి వైరల్ కావడంతో వారిపై చర్యలు చేపట్టారు. 38 మంది జూనియర్ డాక్టర్ల హౌస్మెన్షిప్ను పొడిగించారు. కర్ణాటకలోని గడగ్లో ఈ సంఘటన జరిగింది. గడగ్ ప్రభుత్వ వైద్య కాలేజీ క్యాంపస్లో వైద్య విద్యార్థులు పలు రీల్స్ చిత్రీకరించారు. కొందరు జూనియర్ డాక్టర్లు డ్యాన్స్ చేశారు. రోగుల రిపోర్టులు చూస్తున్నట్లు మరి కొందరు నటించారు. వీల్స్ ఉన్న బెడ్పై కొందరు జానియర్ డాక్టర్లు పలు విధాలుగా ఫోజులిచ్చారు.
కాగా, జూనియర్ డాక్టర్ల రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వారిపై విమర్శలు వెల్లువెత్తాయి. రోగులకు సేవలు అందించాల్సిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో రీల్స్ చేయడంలో బిజీగా ఉన్నారంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో మెడికల్ కాలేజీ డైరెక్టర్ డా. బసవరాజ్ బొమ్మనహళ్లి దీనిపై స్పందించారు. జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ప్రాంగణంలో ఇలాంటివి చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య విద్యార్థులకు మరో 10-20 రోజుల్లో ముగియాల్సిన హౌస్మెన్షిప్ను మరో పది రోజులకు పొడిగించినట్లు వెల్లడించారు.
A day after health and family welfare minister suspended a Doctor for Pre wedding shoot in #Bharamasagara at #Chitradurga, #Karnataka, Today 38 Medical students suspended from #GIMS of #Gadag for shooting reels in hospital. pic.twitter.com/YjW4UQSVhl
— Hate Detector 🔍 (@HateDetectors) February 10, 2024