న్యూఢిల్లీ, మే 23: ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)గా వినయ్కుమార్ సక్సేనా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వినయ్కుమార్ సక్సేనా ప్రస్తుతం ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు.
వ్యక్తిగత కారణాలు చూపుతూ.. అనిల్ బైజాల్ ఈ నెల 18న లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బైజాల్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి తాజా నియామకం చేపట్టారు.