మధ్యప్రదేశ్లో ఘటన.. 8 మంది అరెస్టు
భోపాల్, జూన్ 6: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గ్వాలియర్ జిల్లా అంబజ్హిరిలో ఓ బాలిక(17), ఓ వ్యక్తి (48) ఇంట్లోంచి పారిపోయారు. వారిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చిన కొందరు.. శిక్షగా ఇద్దరి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసుల దృష్టికి చేరింది. బాధ్యులైన ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఘటనపై మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.