Kangana Ranaut | సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, ‘క్వీన్’ కంగనా రనౌత్పై కాంగ్రెస్ తరఫున రాజవంశీకుడు, మంత్రి రాజా విక్రమాదిత్య సింగ్ పోటీ చేయనున్నారు. విక్రమాదిత్య తండ్రి వీరభద్ర సింగ్ ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన తల్లి ప్రతిభా సింగ్ ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ, పీసీసీ చీఫ్ కూడా. ఇప్పటి వరకు జరిగిన 19 ఎన్నికల్లో 13 సార్లు రాజ వంశీకులే ఇక్కడి నుంచి గెలిచారు.
ఆయన తల్లిదండ్రులు మూడేసి సార్లు ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచారు. 2021లో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన తన తల్లి ప్రతిభ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. కంగనా రనౌత్ బాలీవుడ్ సినిమా ‘క్వీన్’లో నటించిన విషయం తెలిసిందే. విక్రమాదిత్య ఆమెను ‘వివాదాల రాణి’ అంటూ విమర్శించారు. దీనికి ఆమె ప్రతిస్పందిస్తూ, విక్రమాదిత్య ‘చోటా పప్పూ’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వీరిరువురి మధ్య పోటీ రసవత్తరంగా సాగబోతున్నది.