బెంగళూరు: సోషల్ మీడియాలో(ట్విట్టర్లో) కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కించపరిచేలా చిత్రీకరించారన్న ఆరోపణలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై కేసు నమోదైంది. కేపీసీసీ సభ్యుడు రమేశ్ బాబు ఫిర్యాదు మేరకు కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాలవీయ ట్వీట్ చేసిన వీడియోలో రాహుల్ గాంధీని కించపరుస్తూ చూపించారని, ఆయనను దేశ వ్యతిరేకిగా సంబోంధించారని పోలీసులు తెలిపారు. మరోవైపు ఎఫ్ఆర్ నమోదుపై బీజేపీ మండిపడింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించింది.