న్యూఢిల్లీ : ఎంతటి కష్టాల్లో ఉన్న వారికైనా మనసును తేలికపరిచి ఆహ్లాదం పంచేది సంగీతమే. స్ట్రీట్ మ్యూజిషియన్తో ఓ వ్యక్తి మన్ భరియా పాటను ఆలపిస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడున్న వారంతా తన్మయత్వంతో వారి కచేరిని వీక్షించారు.
ఈ వీడియోకు మ్యూజిక్ లవర్స్ అంతా ఫిదా అవుతున్నారు. వైరల్ వీడియోను రణ్వీర్ ఠాకూర్ అనే యూజర్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. షార్ట్ క్లిప్లో స్ట్రీట్ మ్యూజిషియన్ గిటార్ వాయిస్తుండగా మరో వ్యక్తి మన్ భరియా పాటను ఆలపిస్తూ కనిపించారు.
ఆపై వీరిద్దరి డ్యూయట్ అక్కడున్న వారందరినీ ఇంప్రెస్ చేసింది. ఈ పోస్ట్ క్యాప్షన్ ప్రకారం లవ్ సింగ్ అనే వ్యక్తి పాటను ఆలపించగా స్ట్రీట్ మ్యూజిషియన్ శివం తన స్వరాలతో అందరినీ కట్టిపడేశారు.