భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కారు అతివేగంతో వెళ్తూ అదుపుకాక ఓ బైకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాజ్గఢ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన బైకర్ను ముందుగా రాజ్గఢ్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం భోఫాల్కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ పురోహిత్ తల్లి చనిపోతే గురువారం ఉదయం ఆమెకు నివాళులు అర్పించడానికి కొడాక్య గ్రామానికి వెళ్లారు. నివాళులు అర్పించి, ప్రకాశ్ పురోహిత్ను పరామర్శించిన అనంతరం ఆయన రాజ్గఢ్కు బయలుదేరారు. రాజ్గఢ్కు చేరుకోగానే ఆయన ఫార్చ్యూనర్ కారు రోడ్డు క్రాస్ చేస్తున్న బైకర్ను వేగంగా ఢీకొట్టింది.
టు వే రోడ్డుపై ఎదురుగా వచ్చిన బైకర్ రాంబాబు (20) యూ టర్న్ దగ్గర రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో మితిమీరన వేగంతో వచ్చిన ఫార్చ్యూనర్ డ్రైవర్ కారును అదుపుచేయలేక ఢీకొట్టాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దిగ్విజయ్ సింగ్ డ్రైవర్ను అదపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. ప్రమాదం జరగ్గానే దిగ్విజయ్ సింగ్ కారుదిగి బాధితుడి దగ్గరికి పరుగుతీసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Congress leader Digvijay Singh ‘s car hit a bike-borne man in MP’s Rajgarh, Driver Akhtar Khan was arrested & car seized by police. pic.twitter.com/JTTmssDjB3
— Political Kida (@PoliticalKida) March 9, 2023