చెన్నై: ప్రజలందరికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah naidu) భోగి (Bhogi) శుభాకాంక్షలు తెలిపారు. సకల జనులకు భోగి.. సుఖసంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. తమిళనాడులోని కొట్లూరుపురంలో ఉన్న స్వగృహంలో వెంకయ్య నాయుడు భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ సానుకూల దృక్పథంలో ముందుకు సాగాలన్నారు. అందరి జీవితాలు ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆనందమయం కావాలన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటల సందడి ప్రారంభమైంది. గంగిరెద్దులు విన్యాసాలు, హరిదాసు కీర్తనలతో సందడి నెలకొన్నది. రంగు రంగుల ముగ్గులతో గ్రామాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.