న్యూఢిల్లీ: పారాలింపిక్స్లో రజత పతకం సాధించిన భవీనాబెన్ పటేల్ను ఉపరాష్ట్రతి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణమని అన్నారు. ‘టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్విట్టర్ ద్వారా అభినందించారు.
జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యువత క్రీడలవైపు మొగ్గుచూపాలని, అది వారిని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులను చేస్తుందని చెప్పారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు టీం స్పిరిట్ను నింపుతుందన్నారు. క్రీడారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి కార్పొరేట్ రంగం మద్దతు అందించాలని సూచించారు.
‘జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు అందించాల్సిందిగా కార్పొరేట్ రంగం సహా ప్రతిఒక్కరికీ పిలుపునిస్తున్నాను. రాబోయే రోజుల్లో భారత్ ప్రధాన క్రీడాశక్తిగా అవతరించాలని ఆకాంక్షిస్తున్నాను. యువత క్రీడల వైపు మొగ్గు చూపాలి. అది వారిని శారీరకంగానే గాక, మానసికంగానూ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరగటంతో పాటు, వారిలో బృంద స్ఫూర్తిని నిండి, జీవనశైలి వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది. క్రీడలు మానసిక ఉల్లాసం కోసమే కాదు, శారీరక ఆరోగ్యం కోసం కూడా’ అని ట్వీట్ చేశారు.