ముంబై: మహారాష్ట్రకు చెందిన సీనియర్ పాత్రికేయుడు, లోకమాత మీడియా గ్రూప్ ఎడిటర్ దిన్కర్ రాయికర్ (79) అనారోగ్యంతో కన్నుమూశారు. రాయికర్కు కొన్ని వారాల క్రితం కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో ఆయన డెంగ్యూ బారినపడ్డారు. అంతకుముందే ఆయన దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. దాంతో గత కొంతకాలంగా ఆయన ఇంట్లో మంచానికు పరిమితమయ్యారు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. పరీక్షించిన వైద్యులు ఆయన ఊపిరితిత్తులు 80 శాతం ఇన్ఫెక్షన్కు గురయ్యాయని చెప్పారు. ఈ క్రమంలో ఇవాళ పరిస్థితి మరింత విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ధృవీకరించారు.
రాయికర్ భార్య, ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో చేరడం ద్వారా తన జర్నలిజం కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత లోక్మాత మీడియా గ్రూప్లో ఔరంగాబాద్ ఎడిషన్ ఎడిటర్గా చేరారు. అనంతరం లోక్మాత మీడియా గ్రూప్ మొత్తానికి ఎడిటర్ అయ్యారు. కాగా, రాయికర్ మృతికి మహా ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సహా పలువురు సంతాపం వ్యక్తంచేశారు.