ముంబై : పాతతరం నటి, దివంగత దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ భార్య సైరా భాను (77) అనారోగ్యంతో దవాఖానలో చేరారు. ఆమె ముంబైలోని హిందుజా ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఆమె భర్త దిలీప్ కుమార్ ఈ ఏడాది జులై 7న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక సైరా భాను ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.