న్యూఢిల్లీ, నవంబర్ 24: ఏదైనా సేవల కోసం ఆధార్ వివరాలు తీసుకొంటున్నప్పుడు వినియోగదారుడు సమర్పిస్తున్న ఆధార్ వివరాలు సరైనవో, కావో కచ్చితంగా పరిశీలించాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అన్ని రాష్ర్టాలు, సంస్థలకు సూచించింది.
ఇతరుల ఆధార్ వివరాలను తమవిగా సమర్పించి దుర్వినియోగానికి పాల్పడిన ఘటనలు వెలుగుచూస్తుండటంతో గురువారం ఈ సూచనలు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎలాంటి సేవలు పొందాలన్నా ప్రభుత్వ గుర్తింపు కార్డుగా ఆధార్ వివరాలు తీసుకొంటున్నారు. దీంతో కొంతమంది తప్పుడు పత్రాలు సమర్పించి సేవలు పొందుతున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే ఆధార్ వివరాలు తీసుకొంటున్నప్పుడు రెండుసార్లు నిశితంగా పరిశీలించాలని యూఐడీఏఐ పేర్కొన్నది.