గువాహటి : (Venkaiah Naidu) ఈశాన్య భారతంలో పర్యటించేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం గువాహటి చేరుకున్నారు. వారం రోజులపాటు ఆయన ఈశాన్య భారతదేశం పర్యటనలో ఉంటారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పలు మార్గాల్లో ట్రాఫిక్ను నియంత్రించారు.
వారం రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో గువాహటి చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు గవర్నర్ జగదీష్ ముఖి, ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, మంత్రి అశోక్ సింఘాల్, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గువాహటిలోని పాన్బజార్లో మహాబాను బ్రహ్మపుత్య రివర్ హెరిటేజ్ సెంటర్ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కేంద్రంలో అసోం వారసత్వాన్ని ప్రదర్శించే పురాతన వస్తువులకు నిలయంగా ఉంటుంది.
అలాగే గువాహటి మెడికల్ కాలేజీ దవాఖాన ఆవరణలో నెలకొల్పిన పీఈటీ-ఎంఆర్ఐ విభాగాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సాయంత్రం శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అవార్డులను బహూకరిస్తారు. సోమవారం ఉదయం వెంకయ్యనాయుడు అక్కడి నుంచి షిల్లాంగ్ వెళ్తారు.
తైవాన్లోకి మళ్లీ చొరబడిన చైనా విమానాలు
రాజస్థాన్లో సాగునీటి కోసం రైతుల ఆందోళన
జీపుల కొనుగోలు కేసులో ఇందిరా గాంధీ అరెస్ట్
బరువు తగ్గించుకోవాలంటే రోజుకు ఎన్ని అడుగులు వేయాలి?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..