షోలాపూర్ : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం టైరు పేలి వాహనం బోల్తాపడిన సంఘటన ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అక్కల్కోట్-సోలాపూర్ హైవేపై కుంభర్లి గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనం కుంభర్లి గ్రామం సమీపంలోకి రాగా.. కుడి వైపున టైరు అకస్మాత్తుగా పేలడంతో అదుపు తప్పి బోల్తాపడిందని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ అతుల్ భోసలే తెలిపారు. ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, ముగ్గురు ఆసుప్రతిలో మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతున్నారు.